15 April, 2026 | 12:55 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

27-03-2025 12:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26(విజయక్రాంతి) : సికిం ద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మహంకాళి సీఐ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. బన్సీలాల్ పేటకు చెందిన ఎర్ర హర్షిత్(21), జీ దేవిప్రణయ్(19)లు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. రాత్రి డ్యూటీకి వెళ్లి బుధవారం తెల్లవారు జామున ఇంటికి వెళుతుండగా మినర్వా గ్రాండ్ హోటల్ చౌరస్తా వద్ద వేగంగా వచ్చిన ఓ కారు వారిని బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలతో ప్రణయ్ ప్రమాద స్థలంలోనే చనిపోయాడు. గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా హర్షిత్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.