2 July, 2026 | 2:55 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

27-03-2025 12:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26(విజయక్రాంతి) : సికిం ద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మహంకాళి సీఐ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. బన్సీలాల్ పేటకు చెందిన ఎర్ర హర్షిత్(21), జీ దేవిప్రణయ్(19)లు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. రాత్రి డ్యూటీకి వెళ్లి బుధవారం తెల్లవారు జామున ఇంటికి వెళుతుండగా మినర్వా గ్రాండ్ హోటల్ చౌరస్తా వద్ద వేగంగా వచ్చిన ఓ కారు వారిని బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలతో ప్రణయ్ ప్రమాద స్థలంలోనే చనిపోయాడు. గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా హర్షిత్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.