2 July, 2026 | 4:04 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్ పరిరక్షణకు ఇన్చార్జి నియామకం

27-03-2025 12:00 AM

ముషీరాబాద్, మార్చి 26: (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ లోని జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్ గేటు వద్ద విధులు నిర్వహించడానికి ఒక జిహెచ్‌ఎంసీ కర్మికున్ని ఇంచార్జీగా నియమించినట్లు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ తెలిపారు. సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చీకటి పడిన వెంటనే తరచు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, రాత్రి వేళల్లో మద్యం సేవించి ప్రశాం తతకు భంగం కలిగిస్తున్నారని, అనధికారిక వెహికల్ పార్కింగ్‌కు నెలవుగా మారిందని అన్నారు.

ఎస్‌ఆర్‌టి జవహర్ నగర్ వ్యాయామశాల, ఆటస్థలం, కళ్యాణ మండపం పరిరక్షణ కమిటీ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ తో సమీక్షించి, సమస్య వివరాలను తెలిపి వారి అనుమతితో ఒక ఇంచార్జీ ను నియమించే నిర్ణయం తీసుకున్నామని తెలి పారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, జిహెచ్‌ఎంసి ఎస్ ఎస్ గోవర్ధన్, ఎస్ ఎఫ్ ఏ శ్రీనివాస్, వెంకటేష్, సిబ్బంది, కమ్యూనిటీ హాల్ కమిటీ సభ్యులు బీజేపీ సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, మదన్మోహన్, సాయి కుమార్, ఆనంద్ రావు, రాజ్ కుమార్, ప్రశాంత్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.