06-06-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, జూన్ 5 (విజయక్రాంతి): జిల్లాలోని రేషన్ కార్డుదారులు మూడు నెలల ఉచిత బియ్యం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం నస్పూర్ లోని 5, 8 చౌకధరల దుకాణాలను సందర్శించి రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌకధరల దుకాణాల ద్వారా జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ సన్నబియ్యంను ఈ నెల 30 వర కు లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేయడం జరుగుతుందని, జిల్లాలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లయితే ఈ-పాస్ ఇంజనీర్లు వెంటనే పరిష్కరించి బియ్యం పంపిణీ సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలో సన్నబియ్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, కార్డుదారులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, చౌకధరల దుకాణం వద్ద తమకు కేటా యించిన రేషన్ సన్నబియ్యం తీసుకోవచ్చని తెలిపారు.
రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియను మండల స్థాయిలో మండల తహసీల్దార్లు, జిల్లా స్థాయిలో జిల్లా పౌరసంబంధాల అధికారి పర్యవేక్షిస్తారని, బియ్యం నిల్వలు అవసరం ఉన్నట్లయితే తమను సం ప్రదించినట్లయితే వెంటనే సరఫరా చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్విని యోగం చేసుకోవాలని ఆయన కోరారు.