16 March, 2026 | 2:55 PM

Breaking News

మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •   ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి   •   విద్యుత్ సరఫరాలో అంతరాయం   •  

ఆశా వర్కర్లకు యూనిఫాం పంపిణీ

17-01-2026 07:01 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండలంలోని తిమ్మాపురం, రామన్నగూడెం, అర్వపల్లి, జాజిరెడ్డిగూడెం, కోడూరు, కొమ్మాల తదితర గ్రామాలలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో జాన్ ఆరోగ్య కమిటీ సమావేశాలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ఆశా వర్కర్లకు యూనిఫాం చీరలను పంపిణీ చేశారు. అనంతరం పలువురు సర్పంచులు, అధికారులు మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో ఆశా వర్కర్ల పాత్ర కీలకమని ఆశాలను అభినందించారు. కరోనా సమయంలో వారు అందించిన సేవలను ప్రశంసించారు.

ఆయా కార్యక్రమాల్లో మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్,తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీఓ గోపి, సీహెచ్ఓ బిచ్చునాయక్, సర్పంచులు చిల్లంచర్ల విద్యాసాగర్, బింగి కృష్ణమూర్తి, బొడ్డు ఇందిరాసోమరాజు, కుంటిగొర్ల శ్రీను, కర్నాటి వెంకన్న, వల్లపు అవిలమ్మ, హెల్త్ సూపర్వైజర్ లలిత, వాణి వార్డు సభ్యులు బొల్లం ప్రభాకర్, సత్తిరెడ్డి, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.