22 April, 2026 | 2:11 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా..

07-04-2025 05:22 PM

రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేంద్ర సహాయ మంత్రి సంజయ్..

హుజురాబాద్ (విజయక్రాంతి): ఇల్లందకుంట శ్రీ సీతా రామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట శ్రీ సీతా రామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పట్టాభిషేకం సందర్భంగా శ్రీ సీత రామచంద్రస్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శ్రీ సీతారామచంద్రస్వామివారి దర్శించుకున్న అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అధికారులతో ఆలయ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.