31-10-2024 01:47:22 AM
హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా ద.మ.రైల్వే అధికారులు బుధవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో జాతీయ ఐక్యతా దివస్ వేడుకలను నిర్వహించారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ తీసుకున్నారు. దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడేందుకు అంకితమవుతాయమని అందరితో జీఎం ప్రతిజ్ఞ చేయించారు.