24 April, 2026 | 1:49 AM

డిగ్రీల కేంద్రాలుగా వర్సిటీలు ఉండొద్దు

24-04-2026 12:30 AM
  1. వీసీలూ బోధించి, ఆదర్శంగా నిలవాలి
  2. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా 

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): డిగ్రీలు అందించే కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు ఉండొద్దని గవర్నర్ శివ్ ప్రతాప్‌శుక్లా అన్నారు. వర్సిటీ వీసీలు కూడా తగతులు బో ధిస్తూ విద్యా నాయకత్వానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో  వర్సిటీల వీసీలు గవర్నర్‌తో గురువారం లోక్ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యలో చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు.

ఉ న్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి సుమా రు 40 శాతం ఉడటం జాతీయ సగటుతో పోలీస్తే అధికమన్నారు. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి సామర్థ్యం, పరిశోధన ఆధారిత వృద్ధిపై వర్సిటీలు దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో వైస్‌చైర్మన్లు ఈ పురుషోత్తం, ప్రొ ఎస్‌కే మహమూద్, కార్యదర్శి ప్రొ శ్రీరామ్ వెంకటేశ్, వీసీలు పాల్గొన్నారు.