17 April, 2026 | 10:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

గుర్తు తెలియని వ్యక్తి మృతి..

08-04-2025 11:11 PM

వైరా (విజయక్రాంతి): మతిస్థిమితం లేని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని హిమామ్ నగర్ గ్రామ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామ సమీపంలోని కోళ్ల ఫారం ఎదురుగా మృతి చెంది ఉన్న వ్యక్తి మృతదేహాన్ని కోళ్ల ఫారంలో పనిచేసే వ్యక్తి ఉదయం చెత్తను పడేసేందుకు పోగా వ్యక్తి శవం కనిపించడంతో పోలీసులు వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపాడు. పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించాడు. మతిస్థిమితం లేని గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించారు. వికలాంగుడిగా, కుడి చేయి లేదని, ఒంటిపై కేవలం నిక్కర్ మాత్రమే ఉందని పోలీసులు గుర్తించారు. మృతుడికి సుమారు (45) సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని ఖమ్మం అన్నం పౌండేషన్కు అందజేశారు. ఎస్సై రఫీ  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.