12-12-2025 12:20:15 AM
మసాయిపేట(చేగుంట), డిసెంబర్ 11 :మాసాయిపేట గ్రామానికి చెందిన బొందిలి లక్ష్మణ్ గౌడ్ ( 55 )గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలు ఆసుపత్రుల్లో చూపించుకున్నప్పటికీ ఆరో గ్యం బాగుపడక పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంలో మృతిని చిన్న కొడుకు దుర్గాప్రసాద్ గౌడ్ ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్.ఐ చైతన్య కుమార్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.