2 April, 2026 | 3:18 PM

Breaking News

కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సాకారం..   •   పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •  

నిరుపయోగంగా ధాన్యం పట్టే యంత్రం

13-10-2025 12:00 AM

యంత్రం ఉపయోగిస్తే రైతుకు జేబుకు చిల్లే?

వలిగొండ, అక్టోబర్ 12 (విజయక్రాంతి):వలిగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన తాలు, మట్టిని వేరు చేసే యంత్రం నిరుపయోగంగా ఉత్సవ విగ్రహంగా మారింది. రైతులు తమ వరి పంటలను మిషన్ల ద్వారా కోయించి నేరుగా మార్కెట్ కు తరలిస్తుండడంతో ధాన్యంలో తాలు, మట్టి వంటివి ఉండిపోతున్నాయి.

అయితే వాటిని వేరు చేసేందుకై మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన యంత్రం రైతులు ఉపయోగించుకోవాలంటే ఎకరానికి దాదాపు 5వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని దీంతో తమ జేబుకు చిల్లు పడడం తప్పదని రైతులు యంత్రాన్ని ఉపయోగించడం లేదు.

దీంతో ధాన్యం పట్టే యంత్రం కవర్లతో కప్పి నిరుపయోగంగా దర్శనమిస్తుంది. అనాలోచిత నిర్ణయాలతో లక్షల రూపాయలు పెట్టి వీటిని కొనుగోలు చేసే బదులు మరిన్ని కాంటాలు పెంచి ధాన్యం కొనుగోలు వేగం అయ్యేందుకు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.