calender_icon.png 18 December, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఉష

17-12-2025 12:52:16 AM

తండా నుంచి ఎదిగిన క్రీడాకారిణి 

గాంధారి, డిసెంబర్ 16 (విజయక్రాంతి): జాతీయ స్థాయి ఎస్జీఫ్ అండర్ బాలికల కబడ్డీ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్‌సంగంకు చెందిన బానోత్ ఉష ఎంపికైనట్టు పాఠశాల హెచ్‌ఎం కుమార స్వామి తెలిపారు. గుడివెనక తండా గ్రామ పంచాయతీకి చెందిన బానోత్ విఠల్, మంగ తీ బాయిల రెండవ కూతురు ఉష పదవ తరగతి చదువుతున్నది. క్రీడల్లో చురుకుగా ఉండటంతో వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా  జాతీయ స్థాయికి ఎంపికైనట్టు ఉష వివరించింది.

నవంబర్‌లో కొత్తగూడెం జిల్లా వొద్దులబయ్యారంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించిన ఉష అద్భుతంగా రాణించింది. దీనితో రాష్ట్ర ఎస్జీఫ్ సమాఖ్య ఉషను ఈ నెల 24 నుంచి మహారాష్ట్రలోని కొప్పుర్ గావ్‌లో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు తెలంగాణ జట్టు కోసం ఎంపిక చేసినట్లు వ్యాయమ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. పేద కుటుంబానికి చెందిన ఉష జాతీయ స్థాయికి ఎంపిక అవ్వడం పట్ల గ్రామస్థులు అభినందనలు తెలిపారు.