11-01-2026 06:38:19 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, సంఘ నాయకులు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలను వేసి అంజలి ఘటించారు. పలువురు మాట్లాడుతూ, పీడిత వర్గాల హక్కుల కొరకు పోరాడిన గొప్ప వ్యక్తి ఓబన్న అని తెలిపారు.
వడ్డెర జాతి వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్నప్పుడు రేనాటి పాలెగాళ్లకు, కంపెనీ పాలెగాళ్లకు చెల్లించే జీతభత్యాలు విషయంలో మొదలైన సంఘర్షణ సాయుధ పోరాటంగా మారుటలో ముఖ్యపాత్ర పోషించారని తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయిధ పోరాటానికి వడ్డే ఓబన్న సైన్యాధ్యక్షునిగా వ్యవహరించారన్నారు. ఇటువంటి పోరాట యోధుల జయంతిని అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయం అని తెలిపారు. ఇటువంటి వ్యక్తుల జయంతులను అధికారికంగా నిర్వహించడం ద్వారా నేటి తరాలకు వారి పోరాట గాధల్ని తెలిపిన వారిమవుతామన్నారు.