15 June, 2026 | 6:14 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

వర్ధమాన్ కళాశాల విద్యార్థులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

19-07-2024 12:21 PM

రంగారెడ్డి: వర్థమాన్ విద్యార్థులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ వర్ధమాన్ కళాశాలకు సంబంధించిన డ్రైవర్ నాగరాజు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో విద్యార్థులని తీసుకువెళ్తున్న బస్సులో కళాశాలకు వెళ్లే క్రమంలో ఒకసారిగా గుండె నొప్పితో కుప్పకూలిపోయాడుఒక్కసారిగా డ్రైవర్ కుప్పకూలడంతో విద్యార్థుల ప్రమతమైన విద్యార్థులు స్థానిక పిల్లర్ నెంబర్ 287 శివరాంపల్లి లోని శ్రీ చంద్ర ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు విడిచినట్టు డాక్టర్లు వెల్లడించారు. నాగరాజు గత సంవత్సర కాలం నుంచి వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు డ్రైవర్ నాగరాజు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో నాగరాజు కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.