15 June, 2026 | 7:19 PM

Breaking News

అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •  

సాంబారులో పురుగు.. ఆందోళనలో విద్యార్థులు

19-07-2024 12:36 PM

డిచ్ పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం బాలికల వసతిగృహంలో సాంబర్ లో పురుగు వచ్చింది. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 21న అల్పాహారంలో బల్లి రాగా, నిన్న రాత్రి సాంబారులో పురుగు రావడంతో విద్యార్థినిలు ఆందోళ చెందుతున్నారు. పదే పదే ఇలానే జరుగుతుందంటూ, దీనిపై మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని పై అధికారులకు ఫిర్యాదు చేశారు. తింటున్న భోజనంలో పురుగులు వస్తే విషయంబయటకు చెప్పొద్దని వార్డెన్, కేర్ టేకర్ భయపేడుతున్నారని ఆవేదన వ్యక్త ంచేశారు. తమ అల్పాహారం, భోజనంలో బల్లి, కప్ప, బొద్దింకలు రావడం సాధారణమైపోందని విద్యార్థులు పేర్కొన్నారు. ఇక నైనా ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడతారేమో చూడాలి.