20-06-2025 07:32:10 PM
సదాశివనగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) సదాశివ నగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో శుక్రవారం నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ లేబర్ కార్యాలయంలో కార్మికుల వెజ్ బోర్డు అగ్రిమెంట్(Veg Board Agreement) నిర్వహించారు. డీసీఎల్ నిజామాబాద్ ఆధ్వర్యంలో గాయత్రి షుగర్స్ వర్కర్స్ యూనియన్, ఐఎన్టీయూసీతో మేనేజ్ మెంట్ కొత్త అగ్రిమెంట్ చేసుకున్నారు. 2024 నవంబర్ 1తేదీ నుంచి అమలు చేసే విధంగా కొత్త వెజ్ బోర్డు అగ్రిమెంట్ చేశారు. ఈ కార్యక్రమంలో గాయత్రి ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణు గోపాల్ రావ్, జీఎమ్ ఫైనాన్స్ మాల కొండయ్య, పిఓ ఐఎన్టీయూసీ కార్మిక సంఘ ప్రతినిధులు మహిపాల్ రెడ్డి, రాజేశ్వర్, మహేష్, మల్లయ్య, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.