24-04-2025 12:06:04 AM
మహబూబ్ నగర్ ఏప్రిల్ 23 (విజయ క్రాంతి) : ఏ ఆర్ కానిస్టేబుల్ వెంకటేష్ హార్ట్ ఎటాక్ తో మరణించడం చాలా బాధాకరమని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. బుధ వారం ఎస్వీ కార్యాలయంలో వెంకటేష్ కు టుంబానికి రూ. 8 లక్షల భద్రతా నిధి అ జి ల్లా ఎస్పీ డి. జానకి అందజేశారు.
ఈ ఏడాది జనవరి 6వ తేదీన డ్యూటీ లో భాగంగా ఎస్కార్ట్ విధులు నిర్వహిస్తు హార్ట్ ఎటాక్ రావడంతో మరణించిన వెంకటేష్ సేవలు పోలీస్ శాఖకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ కుటుంబ సభ్యులు, ఏవో రుక్మిణిభాయి ఉన్నారు.