16-06-2025 05:21:03 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణంలోని అమీనాపురం శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ముగిశాయి. సోమవారం ఉదయం చతు స్థానార్చన, మహా పూర్ణాహుతి, నవ కలశ స్నపనం, చక్రస్నానం, సాయంత్రం సహస్రనామ స్తోత్ర పారాయణం, ద్వాదశ ఆరాధన, శ్రీ పుష్పయాగం, దేవత ఉద్వాసనం, సప్తా వరణం, ధ్వజావరోహణం, మహా కుంభ ప్రోక్షణ, రుత్విక్ సన్మానం, మహదాశీర్వచనము కార్యక్రమం నిర్వహణతో ఉత్సవ పరిసమాప్తి జరిగింది.