1 July, 2026 | 6:58 PM

Breaking News

అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •  

అనంతసాగర్ కోనేటి రాయడు మందిరంలో వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం

12-04-2025 05:15 PM

స్వామివారికి వెండి కిరీటాన్ని బహుకరించిన వెంకటేశం..

కొండాపూర్: వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అనంతసాగర్ లోని కోనేటి రాయుడు మందిరంలో రమనీయంగా అశేష భక్తజన సందోహం మధ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. శనివారం కొండాపూర్ మండల పరిధిలోని అనంతసాగర్ కోనేటి రాయుని మందిరంలో వేద పండితుల మంత్రచారాల మధ్య హనుమాన్ జయంతి ఉత్సవాలను, వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడికి నూతనంగా దాదాపు కిలో వెండితో చేసిన కిరీటాన్ని బిజెపి మండల పార్టీ ఉపాధ్యక్షుడు తూర్పు వెంకటేశం వెండి కిరీటాన్ని బహుకరించారు. ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరచూ స్వామివారి కళ్యాణన్ని తిలకించి పులకించి పోయారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రవిశంకర్, రాజ కీయ నాయకులు ఇంద్రారెడ్డి, ప్రభాకర్, జనార్ధన్ వేమారెడ్డి, భూపాల్ గౌడ్, అనిల్ కుమార్, రఘునాథ్ రెడ్డి, కిరణ్, సంగమేశ్వర్ గౌడ్, హనుమాన్ మాలదారులు దామోదర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.