calender_icon.png 26 June, 2025 | 7:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

25-06-2025 12:07:41 AM

మంత్రి చేతిలో మైక్ లాక్కున్న కేసులో హైకోర్టులో ముగిసిన వాదనలు

హైదరాబాద్, జూన్ 24: మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ పీఎస్‌లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరు తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకో ర్టులో విచారణ ముగిసింది. చౌటుప్పల్ మండలంలోని లక్కారం గ్రామంలో మంత్రి జగదీశ్‌రెడ్డి చేతిలోని మైక్ లాక్కొని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుపడ్డారనే ఆరోపణల నేపథ్యంల 2021లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డిపై చౌటుప్పల్ పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే.

అప్పటి నుం చి ఈ కేసు ప్రజాప్రతినిధుల కోర్టులో పెం డింగ్‌లో ఉంది. అయితే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఫిబ్రవరి 4న హైకోర్టులో ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేశారు. చౌటుప్పల్ పోలీసులు తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

మోహన్‌బాబు పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్, జూన్ 24: పహాడీషరీఫ్ పీఎస్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ నటుడు మంచు మోహ న్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చేనెల 3కి వాయిదా వేసింది. విలేకరి రంజిత్‌పై దాడి కేసులో మోహన్‌బాబుపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విష యం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.