తిరుచురాపల్లి ఈస్ట్ సీటుకు విజయ్ రాజీనామా
11-05-2026 03:14 AM
- లేఖను అసెంబ్లీ సెక్రటరీకి అందజేత
- ఆ అసెంబ్లీ స్థానానికి ఆరు నెలల్లోగా ఉపఎన్నిక
చెన్నై, మే 10: తిరుచురాపల్లి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం సీటుకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆదివారం రాజీనామా చేశారు. మంత్రులు కేఏ సెంగోట్టియన్, పీ వెంకటరణన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరీని కలిసి విజయ్ రాజీనామా లేఖను అందజేశారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచురాపల్లి ఈస్ట్ అసెంబ్లీ సీట్లలో విజయ్ గెలిచారు. ప్రజాప్రాతినిథ్య చట్టం (ఆర్పీఏ)-1951 నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి రెండు నియోజకవర్గాల్లోనూ గెలిస్తే ఒక సీటును వదులుకోవాలి. దీంతో తిరుచ్చి ఈస్ట్కు ఆరు నెలల్లోగా ఉపఎన్నిక జరుగుతుంది.






