- గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ భౌతికకాయం గుర్తింపు.
- డీఎన్ఏ ఆధారంగా భౌతికకాయం గుర్తించిన అధికారులు.
- విజయ్ రూపానీ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగింత.
- అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన విజయ్ రూపానీ.
గుజరాత్: అహ్మదాబాద్లో(Plane Crash)జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ(Former Gujarat CM Vijay Rupani) మృతదేహాన్ని గుర్తించినట్లు సివిల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రజనీష్ పటేల్ తెలిపారు. విజయ్ రూపానీ మృతదేహాన్ని కుటుంబసభ్యులతో డీఎన్ఏ సరిపోల్చిన తర్వాత గుర్తించినట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రుషికేష్ పటేల్(Minister Rushikesh Patel), హోమంత్రి ధృవీకరించారు. విజయ్ రూపానీ భౌతికకాయాన్ని వైద్యులు కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. రాజ్ కోఠ్ లో విజయ్ రూపానీ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ నెల 12న అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణించిన విషయం తెలిసిందే.
"ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్(Chief Minister Bhupendra Patel) మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబానికి డీఎన్ఏ మ్యాచింగ్ జరిగిందని తెలియజేశారు. రాజ్కోట్లో జరిగే అంత్యక్రియల తదుపరి చర్యలలో రాష్ట్ర ప్రభుత్వం వారికి మద్దతు ఇస్తుందని సీఎం కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆయన భౌతికకాయాన్ని ఎప్పుడు స్వీకరిస్తారో కుటుంబ సభ్యులు నిర్ణయిస్తారు." అని గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్కు 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళుతున్న బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే మేఘనినగర్లోని మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిపోయింది. ఈ విపత్తులో 241 మంది ప్రాణాలు కోల్పోయారు, వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్లు, ఏడుగురు పోర్చుగీస్, ఒక కెనడియన్ ఉన్నారు,. 11Aలో కూర్చున్న విశ్వష్ కుమార్ రమేష్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు.