16-02-2026 12:00:00 AM
బాన్సువాడ, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ చైర్ పర్సన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కాసుల విజయ బాలరాజ్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపా యి. మున్సిపల్ ఎన్నికల్లో 19 మంది కౌన్సిలర్లకు గాను 11 కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గెలు పొందారు. మరో మూడు బిజెపి, మరో మూడు బి ఆర్ ఎస్, ఇతరులు 1 ఎంఐఎం ఒక టి గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి అయిన కాసుల విజయ బాలరాజు చైర్పర్సన్ గా లాంచనంగా ప్రకటించడం జరగనుంది.
వైస్ చైర్మన్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి, పోచారం భాస్కర్రెడ్డిల నమ్మినబంటు రేష్మఎజాజ్లను వైస్చైర్మన్గా నియమించేం దుకు కౌన్సిలర్లతో ఒప్పందం జరిగినట్లు సమాచారం. వైస్ చైర్మన్ లాంచరంగానే రేష్మజాస్కు ఇవ్వడం జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
బాన్సువాడ మున్సిపాలిటీ పట్టణ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకోనున్నారు. బాన్సువాడ అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటారని ప్రజలు ఆశిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కౌన్సిలర్లు 11 మంది క్యాంపులో ఉన్నారు. సోమవారం ఉదయం నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ప్రమాణస్వీకారంలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రమాణ స్వీకారానికి మున్సిపల్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.