13 April, 2026 | 5:06 PM

తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు

13-04-2026 03:30 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తంగళ్ళపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో రోడ్డు భద్రతపై పాటించాల్సిన నియమాలు, ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా చర్చించారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలి.

ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చని తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు 9 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు గ్రామంలోని ప్రతి ఒక్కరికీ రోడ్డు భద్రతపై అవగాహన పెంచే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.