నందివాడలో ఉపాధి పనుల పరిశీలన
23-05-2026 05:47 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో శనివారం ఉపాధి పనులను గ్రామ సర్పంచ్ సంకు పోచయ్య, వార్డు సభ్యులు పరిశీలించారు. గ్రామంలోని పెద్ద చెరువులో జరుగుతున్న పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చెరువులో పనులు నాణ్యతగా చేయాలని సూచించారు. చెరువులోని మట్టిని ఒక క్రమ పద్ధతి ప్రకారం తీయాలన్నారు. చెరువులో మట్టి ఎంత వెళ్లిపోతే అంత గ్రామంలో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సంతోష్,గ్రామ పెద్దలు రాములు, రాజు, సాయిలు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.






