1 July, 2026 | 7:45 PM

Breaking News

ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •  

తాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు

25-04-2025 04:13 PM

కామారెడ్డి జిల్లా పిట్లంలో ఆందోళన చేసిన గ్రామస్తులు...

కామారెడ్డి (విజయక్రాంతి): తాగునీటి సమస్య పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా(Kamareddy District) పిట్లం మండలంలోని తిమ్మనగర్ గ్రామంలో గ్రామస్తులు శుక్రవారం రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. నీటి ఎద్దడిపై ఎన్ని పర్యాయాలు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు పేర్కొన్నారు. గంటకు పైగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అప్పటికి స్పందించిన గ్రామ పంచాయతీ సెక్రటరీ వచ్చి గ్రామస్తులపై దురుసుగా ప్రవర్తించడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సెక్రటరీని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి మా సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు నిలదీశారు. నీటి సమస్య ఏర్పడానికి సెక్రెటరీ ని నువ్వే కారణం అని సెక్రటరీ పై మండిపడ్డారు. ఎన్ని పర్యాయాలు కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ సకాలంలో సెక్రటరీ ఉండకపోవడంతో సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇలా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశామని గ్రామస్తులు తెలిపారు.