1 July, 2026 | 6:38 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

ఆరు ముళ్ళ బంధం ఆ యువకుడిది....!

25-04-2025 02:22 PM

ఓకే మండపంలో ఇద్దరితో పెళ్లి 

గతంలోనూ యువకుడు ఇద్దరు యువతలను పెళ్ళాడాడు

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మూడుముళ్ల బంధంతో పెళ్లి తంతు జరగాల్సి ఉండగా ఒక యువకుడు ఆరు ముళ్ళు వేశాడు. జిల్లాలోని జైనూరు మండలం అడ్డెసార గ్రామానికి చెందిన ఆత్రం ఛత్రు షాన్ ఇద్దరి యువతులతో ప్రేమాయణం కొనసాగించాడు. ట్రయాంగిల్ ప్రేమ వ్యవహారం సదరు యువతులకు తెలవడంతో ఇద్దరు యువతులు ఆ యువకుడినే పెళ్లి చేసుకునేందుకు పట్టుపట్టారు.

ఈ విషయం ఇంటి పెద్దలకు తెలవడంతో చేసేది ఏమీ లేక కుటుంబ సభ్యులను ఒప్పించి ఆ ముగ్గురు ఒకటయ్యారు. వివాహ ఆహ్వాన పత్రికలోనూ వరుడుతోపాటు ఇద్దరి యువతుల ఫోటోలను ముద్రించి బంధుమిత్రులను ఆహ్వానించారు. బంధువుల సమక్షంలో గురువారం(24) న రాత్రి అంగరంగ వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో జంగుబాయి, సోన్ దేవి లను ఛత్రుషాన్ వివాహం చేసుకున్నాడు.

వివాహ తంతు  వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో  వైరల్ గా మారింది. మార్చి 28న లింగాపూర్ మండలం గుమ్నుర్ గ్రామంలో గిరిజన యువకుడు  సూర్యదేవ్ సిర్పూర్ మండలానికి చెందిన ఆత్రం జల్కర్ దేవి, లాల్ దేవి తొప్రేమ వ్యవహారం సాగించారు. ఇద్దరి యువతులకు విషయం తెలియడంతో ఇరువురిని నచ్చజెప్పి కుటుంబ పెద్దలను ఒప్పించి  పెళ్లి చేసుకున్న సంఘటన నెలకొంది.