08-09-2025 01:14:06 AM
శాలువాలతో సత్కరించి అవార్డు ప్రదానం
ముషీరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): గత 53 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహి నిర్వహిస్తున్నందున జాతీయ మానవ హక్కులు, సామాజిక న్యాయ కమిషన్ చైతన్య యూత్ అసోసియేషన్ రాంనగర్కు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వ్యవస్థాపకుడు శ్రీ గణేష్ ఉత్సవ్ బాలగంగాధర్ తిలక్ పేరు మీద సనాతన్ యూని టీ అవార్డును ప్రకటించింది.
ఈ అవార్డును హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు సురేందర్, వేణు మాధవ్, నాగరాజ్ కలిసి చైతన్య యూత్ అసోసియేషన్ సభ్యుడు విన్ను ము దిరాజ్కు శాలువాలతో సత్కరించి అవార్డు ప్రధానం చేసినట్లు ఆదివారం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు నగేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.