12-08-2025 12:00:00 AM
మహేశ్ కుమార్ గౌడ్ :
దేశంలో స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలన్నీ పదకొండేళ్ల నరేంద్ర మోదీ నియంతృత్వ పాలనలో గాడి త ప్పుతున్నాయి. అడ్డదారులను ఆసరాగా చే సుకున్న బీజేపీ కేంద్రంలో గద్దెనెక్కడం ది గజారుడు రాజకీయాన్ని చూపిస్తోంది. ప్రజాగ్రహానికి మహారాజ్యాలే కుప్పకూలాయనే వాస్తవాలను గ్రహించలేని బీజేపీ వ్యవస్తలన్నింటినీ తమ కబంద హస్తాల్లో బంధించి ప్రతిపక్షాలపై ఉసిగొల్పింది. ఈసీ, ఈడీ, సీబీఐ ఇలా ప్రభుత్వ ఏజెన్సీలన్నింటినీ దుర్వినియోగపరుస్తూ ప్రత్యర్థులను ఇబ్బందులు పెడుతోంది.
ఇం దులో భాగంగా ప్రజాస్వామ్యంలో అతి కీలకమైన ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న బీజేపీ నియంతృత్వ పోకడలకు ముకుతాడు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలో బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కై ఎన్నికల ప్రక్రియను పక్కదారి పట్టిస్తున్న విధానాన్ని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కళ్లకు కట్టినట్టు ఆధారాలతో నిరూపించడంతో యావత్ దేశం విస్మయానికి గురైంది. ప్రజావ్యతిరేకత ఎ దుర్కొంటున్న మోదీ ప్రజాక్షేత్రంలోని అ ంచనాలకు విరుద్ధంగా గెలుస్తుండడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది.
దే శంలో ప్రతిపక్ష పార్టీలు బీజేపీ విజయాలను విమర్శించడం రాజకీయాల్లో భాగమనుకోవచ్చు. అయితే ప్రముఖ మీ డియా సంస్థలు, ఏజెన్సీలు నిర్వహించిన సర్వే అంచనాలు పలుమార్లు తలకిందులయ్యాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల అనంతరం హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దేశంలోని ప్రజాస్వామ్యవాదుల్లో పలు అనుమానాలు రేకెత్తించాయి.
లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానాలో భారీగా నష్టపోయిన బీజేపీ ఆరు నెలల వ్యవధిలోనే జరిగిన రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అందలమెక్కడం పలు అనుమానాలకు తావిచ్చింది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలప్పుడే వీటిపై ఆధారాలతో రాహుల్ ప్రశ్నించినా బీజేపీ ఒత్తిడికి తలొగ్గి ఎన్నికల సంఘం పెడచెవిన పెట్టింది.
మహారాష్ట్ర ఎ న్నికల్లో సమయం ముగిశాక సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 మధ్య 65 లక్షల మంది ఓట్లు వేసినట్లు ఎన్నికల సంఘం గణాంకాల్లో తేలింది. రెండు గంటల వ్యవధిలో ఇంతమంది ఓటు వేయడం అసా ధ్యమని తెలిసినా అధికార యం త్రాంగం పట్టించుకోలేదు. దీనిపై అప్పుడే రాహుల్ గాంధీ పలు ఆధారాలతో గొంతెత్తినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు.
తాడోపేడో తేల్చాలనే లక్ష్యంతో..
ఎన్నికల ప్రక్రియలో భాగంగా దేశంలో కొంత కాలంగా జరుగుతున్న అవకతవకలపై ప్రజాక్షేత్రంలోనే తాడోపేడో తే ల్చుకోవాలనే లక్ష్యంతో రాహుల్ గాంధీ ప లు ఆధారాలు బహిర్గతం చేశారు. అడ్డదారులతో అధికారంలోకి రావడమే బీజేపీ విజయ రహస్యమని గమనించిన కాంగ్రెస్ వాటికి తగిన రీతిలో సమాధానమిచ్చింది.
కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మహాదేవపురం అసెంబ్లీ సెగ్మెంట్లో లో పాలను రాహుల్ ఎ త్తిచూపారు. బెంగుళూర్ సెంట్రల్ ఎంపీ స్థానాన్ని, మ హాదేవపురం అసెంబ్లీ సీటు ను గెలవడాని కి ఓట్ల రిజిస్ట్రేషన్ మొదలు ఓటింగ్ ప్ర క్రియ వరకు అక్రమాలు చేస్తూ వచ్చింది.
లక్షకు పైగా దొంగ ఓట్లే..
మహాదేవపురంలో బీజేపీ ఐదు రకాలు గా ఓట్ల చోరీ చేస్తుందని రాహుల్ గాంధీ గణాంకాలతో సహా నిరూపించారు. ని యోజకవర్గంలో ఆరున్నర లక్షలకుపైగా ఓ టర్లుండగా, అందులో లక్షకుపైగా దొంగ ఓట్లే. ఇక్కడ 11 వేలకుపైగా డుప్లికేట్ ఓట్లున్నాయి. తప్పుడు చిరునామాలతో 40 వే లకు పైగా ఓట్లున్నాయి. ఒకే అడ్రస్ పేరిట బల్క్ ఓట్లు నమోదయ్యాయి. 4 వేలకుపైగా ఓటర్ల ఫోటోలు తప్పుగా ఉన్నాయి.
ఓటర్లను చేర్చేందుకు, తొలగించేందుకు వి నియోగించే ఫారం-6 దరఖాస్తులు సు మారు 33 వేలకుపైగా దుర్వినియోగమయ్యాయి. ఈ ఐదు రకాల తప్పుడు విధానాలతో మహాదేవపురంలో బీజేపీ లక్షకుపైగా మెజార్టీ సాధించడంతో 2024 ఎన్నికల్లో ఆ పార్టీ బెంగుళూర్ సెంట్రల్ లోక్సభ స్థానాన్ని 32 వేలకుపైగా మెజార్టీతో గెలిచింది.
బీజేపీ అక్రమాలు ఒక్క బె ంగుళూరు సెంట్రల్కే పరిమితం కాలేదు. ఇదే ఎన్నికల్లో బీజేపీ 25కు పైగా ఎంపీ సీ ట్లను 33 వేల కంటే తక్కువ మెజార్టీతోనే గెలవడం ఆ పార్టీ చేస్తున్న ఓట్ల చోరీకి నిదర్శనం. దేశంలో పలు చోట్ల భారీగా ఓట్ల నమోదు కావడం బీజేపీ గెలుపుకు దో హద పడ్డాయి.
కుతంత్రం బయటపడేదేమో?
ఓట్ల చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ ఒక మహాదేవపురం ఆధారాలనే కాక ఇతర చోట్ల లోపాలను కూడా పసిగట్టి నిరూపించారు. దేశంలో చిరునామా లేని ఎపిక్ కార్డులు వేల సంఖ్యలో ఉండటం, ఒకే ఇంట్లో వందకుపైగా ఓటర్లుండడం వంటి లోపాలను కాంగ్రెస్ ఆధారాలతో సహా నిరూపించింది. మరోవైపు బీజేపీ కార్యకర్తలు బూత్ స్లిప్పులు చూసి, ఒకే వ్యక్తి పేరుతో ఒకే ఎన్నికల కేంద్రంలో చాలా ఓట్లు వేయించి ‘ఒక వ్యక్తి ఒక ఓటు’ అనే సూత్రానికి తిలోదకాలిచ్చారు.
ఎన్నికల అవకతవకలపై కాంగ్రెస్.. ఎన్నికల కమిషన్ను సంప్రదించినా స్పందన కరువైంది. పలు వివరాలు కావాలని ఈసీని కోరితే మొక్కుబడిగా కొన్ని ఓటర్ల జాబితాను అందించారు. ఆ సమాచారంతోనే రాహుల్ గాంధీ బీజేపీ, ఎన్నికల కమిషన్పై అణుబాంబు పేల్చారు. కాంగ్రెస్ కోరినట్టు ఈసీ డిజిటల్ రూపంలో మరిన్ని వివరాలు ఇచ్చుంటే మరింత సమగ్రంగా అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా బీజేపీ ఎన్నికల కుతంత్రాలను రాహుల్ బహిర్గతం చేసేవారు.
ఆ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం..
రాహుల్ ఆరోపణలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ ఎన్నికల సంఘం వ్యాఖ్యానించడం బాధ్యతారాహిత్యం. ఓట్ల చోరీ ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ ఆయన వాదన నిజమని నమ్మితే, అఫిడవిట్తో ఫిర్యాదు చేయాలని ఎన్నికల స ంఘం చెప్పింది. రాహుల్ గాంధీ తాను నమ్మింది నిజమనే భావనతోనే ఆరోపణలు చేశారు. ఇప్పుడు మళ్లీ అవన్నీ ని జమని నమ్మితే అఫిడవిట్ ఇవ్వమని ఈసీ చెప్పడం హాస్యాస్పదం.
లోక్ సభ ఎన్నిక ల సమయంలోనే బీజేపీతో పాటు ఎన్నిక ల సంఘంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారాలను ఇవ్వకపోవడం, వీవీ ప్యాట్లను లెక్కించడంపై ఈసీ వెనకడుగు వేసింది. ఈవీఎ ంలో వీవీపాట్స్లో కొన్నింటినే శాంపిల్గా తీసుకొని లెక్కించడంతో ఓటింగ్ సంఖ్యపై అనుమానాలున్నాయి. ఈవీఎం సాఫ్ట్వేర్, భద్రతా ప్రక్రియలకు సంబంధించి స్వ తంత్ర నిపుణుల ద్వారా పరిశీలించేందుకు ఎన్నికల సంఘం ముందుకు రావడం లేదు.
పోలింగ్ శాతం వివరాలను ప్రకటించడంలో ఎన్నికల సంఘం ఆలస్యం చే స్తుండటంతో పలు అనుమానాలు వస్తున్నాయి. ఇందుకు మహారాష్ట్ర ఎన్నికలే ని దర్శనం. అడ్డదారులతో అదంలం ఎక్కిన బీజేపీ నియంతృత్వ పోకడలతో వ్యవస్థల ను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే గతంలో ‘వన్ నేషన్ -వన్ ఎలక్షన్’ అంటూ జమిలి ఎన్నికల ప్రకటన, ఇప్పుడు బీహార్లో 65 లక్షలకుపైగా ఓట్ల తొలగింపు వంటి అప్రజాస్వామ్య ప ద్దతులను అనుసరిస్తుంది.
బీహార్లో త్వ రలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నే పథ్యంలో ఓటర్ల జాబితా పరిశీలన పే రు తో ఒక వ ర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఓ ట్లను తొలగిస్తున్నారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్ర జాస్వామాన్ని పరిరక్షించాలని పోరాడుతు న్న కాంగ్రెస్ దేశంలో ఓట్ల దొ ంగతనం, బీ హార్లో ఓట్ల తొలగింపుపై ప్ర జల వద్దకు వె ళ్తుంది. పార్లమెంట్ వేదికగా వీటిపై చర్చ జరగాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి పార్టీలు కో రుతున్నా న రేంద్ర మోదీ ప్రభుత్వం తమ లొసుగులు బయటపడుతాయనే జం కుతో చర్చించకు ండా పారిపోతున్నాయి.
ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుందామనే ల క్ష్యంతో ఈసీకి శాంతియుతంగా వినతిప త్రం ఇవ్వడం కోసం ర్యాలీగా వెళ్తే ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ , ప్రియాంక సహా ‘ఇండియా’ కూటమి నేతలను అరెస్టు చేయడంతోనే బీజేపీ హ యాంలో ఓట్ల దొంగతనం అయ్యిందని ని రూపితమవుతోంది. అధికార బలంతో రాహుల్ గాంధీని అరెస్టు చేస్తే యావత్ దే శం ఆయనకు మద్దతుగా నిలబడి ఓటు దొంగలకు బుద్ధి చెప్పడం ఖాయం.
-వ్యాసకర్త, టీపీసీసీ అధ్యక్షులు.