11 March, 2026 | 2:48 PM

Breaking News

మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •   ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.3.95 కోట్ల రివార్డు ఉన్నవారు   •  

జిల్లాలో ఓటరు మ్యాప్ వేగవంతం

18-02-2026 01:15 AM

నిర్మల్, ఫిబ్రవరి ౧౭ (విజయక్రాంతి): ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఓటరు మ్యాపింగ్ నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాలులో నుంచి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.

సమావేశం అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, ఓటరు ప్రోజెని మ్యాపింగ్లో మరింత వేగవంతం చేయాలని సూచించారు. 2002 వివరాలతో ప్రస్తుత వివరాలను సరిపోల్చి మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా ప్రోజెని మ్యాపింగ్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, తహసిల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.