తాడ్వాయిలో మన్ కీ బాత్ వీక్షణ
27-07-2026 01:59 AM
తాడ్వాయి, జూలై 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని 113 వ బూత్ లో ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. తాడ్వాయి మండల బిజెపి అధ్యక్షులు వెల్మ సంతోష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి హోటల్ శ్రీను, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట్రావు, మండల ప్రధాన కార్యదర్శి ముదాం దత్తాత్రి, 113వ బూత్ అధ్యక్షులు కిషన్ రావు,నాయకులు రమేష్ ప్రకాష్ లు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.ఈ కార్యక్రమాన్ని వీక్షించారు 136వ ఎపిసోడ్ లో ప్రధాని నిర్దేశించిన విషయాలు జాగ్రత్తగా విన్నారు. ఆయన సూచించిన కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమం తో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.






