calender_icon.png 15 July, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతపరమైన కోటాకు మేం వ్యతిరేకం

15-07-2025 01:18:15 AM

  1. 10 శాతం మతపరమైన కోటా చేర్చడం సరికాదు
  2. రిజర్వేషన్ల అమలు బాధ్యత కాంగ్రెస్‌దే 
  3. స్థానిక సంస్థల ఎన్నికల్లో  ప్రత్యక్షంగా పోటీ  
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు  

నల్లగొండ టౌన్ జూలై 14 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లలో మతపరమైన కో టాకు తాము వ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పేరిట 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం మతపరమైన కోటా చేర్చడం సరికాదన్నారు.

సుప్రీంకోర్టు కూడా రిజర్వేషన్లను నిరాకరించిందని తెలిపారు. మతపరమైన రిజర్వేషన్ల వల్ల నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతోందని, బీసీ వర్గాలు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వమేనని, దానిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా వారిదేనని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామస్థాయి నుంచి జడ్పీటీసీ స్థాయి వరకు బీజేపీ ప్రత్యక్షంగా పోటీ చేస్తుందని తెలిపారు.

గతంలో బీజేపీ స్థానిక ఎన్నికల్లో పెద్దగా పోటీ చేయలేదని, కానీ ఈ సారి బలంగా పోటీ చేస్తామని పేర్కొన్నారు.  నల్లగొండ జిల్లాలో సోమవారం ఆయన ప ర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం లో మీడియాతో మాట్లాడుతూ తాను తన సొంత జిల్లా అయిన నల్గొండలో పర్యటిస్తుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి కూడా రేషన్ కా ర్డుల పంపిణీ కార్యక్రమం కోసం ఉమ్మడి న ల్లగొండ జిల్లాకు వస్తున్నారన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇవ్వాలని  డిమాం డ్ చేశారు. రేషన్ కార్డులను పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతోందని ఆ రోపించారు. ఉచిత సన్నబియ్యాన్ని కేంద్ర ప్ర భుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజ న కింద ఉచితంగా అందిస్తుంటే  రాష్ట్ర ప్ర భుత్వం కేంద్రానికే కృతజ్ఞత చెప్పకుండా దా న్ని తమ క్రెడిట్‌గా చెప్పుకుంటోందని మండిపడ్డారు. గతంలో రేషన్ షాపుల్లో ఉన్న ప్రధా ని మోదీ బొమ్మలను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించడం సరికాదన్నారు.

ఎస్‌ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పనులు ఎందుకు నిలిచి పోయాయో స్పష్టతనివ్వాలని డిమాండ్ చే శారు. సమావేశంలో మాజీ ఎంపీ బూర న ర్సయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు గొంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు శానంపూడి సై దిరెడ్డి, చింత సాంబమూర్తి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.