calender_icon.png 16 October, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల్వంచ పట్టణ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

16-10-2025 01:57:20 AM

  1. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

పాల్వంచ పట్టణంలో రూ1.07 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్ ను సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట, మున్సిపల్ కార్యాలయం రోడ్, బీసీఎం రోడ్, ఇందిర కాలనీ, నెహ్రూ నగర్ ప్రాంతాలలో రూ 1 కోటి 7 లక్షల నిధులతో సీసీ రోడ్లు, సిసి డ్రైన్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ ప్రతి బస్తీలో రోడ్లు డ్రైన్ ల నిర్మాణ పనులు పై పూర్తిస్థాయిలో దృష్టి సారించి నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. రహదారులు త్రాగునీరు విద్యుత్ సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపించి తీరుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నామని ఒక్కొక్కటిగా ప్రతి పనిని పూర్తి చేసి తీరుతామన్నారు.

పాల్వంచ కొత్తగూడం మున్సిపాలిటీలు కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నామని కార్పొరేషన్ ఏర్పాటుతో నగరాలకు దీటుగా పాల్వంచ మున్సిపాలిటీని అభివృద్ధి పరుస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ధారా ప్రసాద్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కె సుజాత, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె  సాబీర్ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం,

జిల్లా కార్యవర్గ సభ్యులు  వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్, జిల్లా సమితి సభ్యులు వీ పద్మజ, డీ సుధాకర్, నిమ్మల రాంబాబు ఇట్టి వెంకట్రావు, నాయకులు శనగారపు శ్రీనివాసరావు వైయస్ గిరి సీపీఐ, వల్లపు యాకయ్య, గౌస్, SA రెహమాన్, కరీం, రమేష్, గణేష్, ఆదినారాయణ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.