22 May, 2026 | 11:07 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

ప్రజలకు వైద్యం అందుతుందనే భరోసానిస్తున్నాం

23-03-2025 12:26 AM

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): రోగం వస్తే ఉచితంగా వైద్యం అందుతుందనే భరోసా ప్రజలకు కల్పిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం ఆరో గ్యశాఖ బడ్జెట్ పద్దుపై ఆయన సమాధానమిచ్చారు. ఉస్మానియా హాస్పి టల్ తెలంగాణకు తలమానికమని, గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు.

గోషామహల్‌లో సు మారు 27 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా దవాఖాన  నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింద న్నారు. క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స అందించేందుకు ఉమ్మడి జిల్లాల్లో రీజనల్ కేన్సర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని, మొబైల్ స్క్రీనింగ్ యూనిట్లు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇటీవలే కొత్తగా 213 అంబులెన్స్‌లను ప్రారంభించుకున్నామని.. ఫలితంగా వీటితో ఎమర్జన్సీ రెస్పాన్స్ టైమ్ 14 నిమిషాలకు తగ్గిందన్నారు.