02-06-2025 01:50:22 AM
300 మంది కోడెలను స్థానిక రైతులకు పంపిణీకి చర్యలు
500 పశువులకు ఎల్.ఎస్.డి వ్యాక్సినేషన్ పూర్తి
అనారోగ్యం బారిన పడిన 16 కోడెలకు చికిత్స అందించి బ్రతికించాం
అకాల వర్షాలు, అనారోగ్య పరిస్థితుల కారణంగా మొత్తం 17 కోడెలు మృత్యువాత
సిరిసిల్ల, జూన్-1(విజయక్రాంతి): వేములవాడ తిప్పాపూర్ లోనే గోశాలలో ఉన్న కో డెల రక్షణకు పట్టిష్ట చర్యలు చేపట్టామని,ఈ మెడికల్ క్యాంపు కోడెలు పూర్తి ఆరోగ్యంగా అయ్యేవరకు నిర్వహిస్తామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అకాల వర్షాలు అనారోగ్య పరిస్థితుల కారణంగా తిప్పాపూర్ లోని గోశాలలో మొదట 8 కోడెలు మరణించగా జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్త మై 5 వెటర్నరీ డాక్టర్లతో కూడిన 12 మంది వైద్య బృందం ఏర్పాటు చేసి గోశాలలోని ప శువులను పరిశీలించడం జరిగింది.రెండవ రోజు అనారోగ్య కారణంతో మ రో 5 కోడె లు మరణించాయి.
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కోడెల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి ఎ ల్.ఎస్.డి వ్యాక్సిన్ 500 పశువు లకు వేసామని తెలిపారు. అనారోగ్యం పాలైన 20 ప శువులను ప్రత్యేకంగా చికిత్స అందించి వాటి లో 16 పశువుల ప్రాణాలు రక్షించామని, మరో 4 కోడెలు మరణించాయని అన్నారు. గోశాలలో మొత్తం 17 కోడెలు అనారోగ్య పరిస్థితులతో మరణించాయని, మిగిలిన పశువులు ఆరోగ్యంగా ఉన్నాయని ఈ మెడికల్ క్యాంపు కోడెలు పూర్తి ఆరోగ్యంగా అ య్యేవరకు నిర్వహిస్తామని , 300 కోడెలను స్థానిక రైతులకు పంపిణీ చేసేందుకు ఏర్పా ట్లు చేశామని అన్నారు.
సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను రాజ న్న స్వామి భక్తులు నమ్మవద్దని, కోడెల ఆరోగ్య సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధి కారి డా. రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.