calender_icon.png 3 June, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న గోశాలలో ఆగని కోడెల మరణాలు

02-06-2025 01:47:31 AM

  1. తాజాగా 5కోడెలు మృతి

కలెక్టర్ ఆధ్వర్యంలో కోడెల   పంపిణీ

వేములవాడ, జూన్1(విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఎములాడ రాజన్న ఆల య గోశాలలో కోడెల మృత్యు ఘోష ఆగ డం లేదు.  ఇప్పటికే గత 4రోజుల్లో 18కోడె లు మృత్యువాత పడగా తాజాగా ఆదివారం గోషాలలోని 5 కోడెలు అనుమానాస్పదం గా మృతి చెందాయి. దీంతో గోశాల పరిస్థితిపై మరింత ఆందోళన నెలకొంది. చనిపో యిన కోడెలను గోశాల సిబ్బంది గుట్టు చ ప్పుడు కాకుండా మూలవాగులో ఖననం చేసినట్టు తెలుస్తుంది.

జిల్లా కలెక్టర్, దేవాదా య శాఖ అధికారులు ఇచ్చిన స్పష్టమైన సూ చనలను  గోశాల సిబ్బంది పట్టించుకోకుం డా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గోశాల నిర్వాహకులను వెంటనే సస్పెండ్ చే యాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

అలాగే, కోడెల పం పిణీ ప్రక్రియను వెంటనే ప్రారంభించి నిరంతరంగా కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం సా యంత్రం 300కోడెలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధిం చి రైతులు దరఖాస్తు చేసుకునేందుకు  ప్రత్యే క వెబ్ సైట్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు.పంపిణీ చేసిన కోడలు 32 జతలు 66 కోడలు ఆయా రైతులకు పంపిణీ చేశారు.

జీవాలకు మెరుగైన దాణా, పచ్చిగడ్డి ఇచ్చేలా ప్రణాళిక కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 

కోడె పిల్లలను పొందిన రైతులు వాటి సంరక్షణ బాధ్యతను పక్కాగా చూడాలని సూచించారు. వాటి నిర్వహణ తదితర అం శాల్లో ఏమైనా పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోశాల ఆవరణలో లోతుగా ఉన్న స్థలంలో మట్టిని పోయిస్తూ చదును చేస్తున్నామని తెలిపారు.

కోడెలకు మెరుగైన దాణా, పచ్చిగడ్డి అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వాటిని అందిస్తున్నామని వివరించారు. పశువైద్యాధికారుల బృందంతో జీవాలకు వైద్యం అందిస్తూ పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు.