19-06-2025 01:04:10 AM
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాం తి): వానాకాలం ప్రారంభమైన నేపథ్యం లో ఆర్అండ్బీ అధికారులు క్షేత్ర స్థాయి లో అప్రమత్తంగా ఉండాలని రో డ్లు, భ వనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించా రు. బుధవారం హైదరాబాద్లో ఆర్అండ్బీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా హెడ్క్వార్టర్లో అందుబా టులో ఉంటూ క్షేత్రస్థాయిలో రోజువారీ పర్యవేక్షణ చేయాలని సూచించారు.
భారీ వర్షాలు, వరదల వల్ల రోడ్ల కనెక్టివిటీకి ఎక్కడా ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉధృతంగా ప్రవహించే నదులు వాగులు వద్ద బ్రిడ్జిలు, కల్వర్ట్పై ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అం దుకు అనుగుణంగా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి రాష్ర్ట ప్ర ధాన కార్యాలయ కంట్రోల్ సెంటర్కు అ నుసంధానం చేయాలని సూచించారు.
గతంలో ఏర్పడిన గుంతల రోడ్లు పూ డ్చేందుకు ఆర్అండ్బీ ఆధ్వర్యంలో యు ద్ధ ప్రాతిపదికన మరమ్మతు చర్యలు చేపట్టామని, ఇంకా పెండింగ్లో ఉన్న రోడ్డు ప్యాచ్ వర్క్లపై అధికారులను ఆరా తీశా రు. రాష్ర్టవ్యాప్తంగా ఆర్అండ్బీ స్టేట్ రో డ్స్కు సంబంధించి మొత్తం 1,214 గుంత లు ఏర్పడి 2,488 కి.మీ. రోడ్డు పాక్షికంగా దెబ్బతిందని, 2,186 కి.మీ. రోడ్డు మరమ్మతు పనులు పూర్తయ్యాయని, ఇంకా 302 కి.మీ. రోడ్డు మరమ్మత్తుల పనులు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవాటి ప్రోగ్రెస్తో పా టు వాడుకలో ఉన్న వాటి నాణ్యతకు సంబంధించిన వివరాలతో వారంలోపు పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘మంచి రో డ్లు-అభివృద్ధికి చిహ్నాలు’ నినాదంతో ముందుకెళ్లాలని, జిల్లా కేంద్రం నుంచి గ్రామస్థాయి వరకు పంచాయతీరాజ్, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.