15 April, 2026 | 1:54 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తేవాలి

17-02-2026 01:00 AM

విద్యార్థులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నిజామాబాద్, ఫిబ్రవరి 16(విజయ క్రాంతి): రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో జిల్లాకు చెందిన బాలబాలికలు తమ ప్రతిభను చాటి నిజామాబాద్ ప్రతిష్టను పెంపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని దోమలగూడలో మంగళవారం నుండి క్రీడా పోటీలు నిర్వహిస్తుండగా, నిజామాబాద్ జిల్లా నుండి 35 మంది బాలబాలికలతో కూడిన బృందం ఈ పోటీల్లో పాల్గొనేందుకు సోమవారం బయలుదేరి వెళ్ళింది.

ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద నుండి చిన్నారులు బయలుదేరి వెళ్తున్న ప్రత్యేక బస్సుకు కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి, చిన్నారులకు ఆల్ ది బెస్ట్ అని విషెస్ తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. చిన్నారులను జాగ్రత్తగా తీసుకెళ్లాలని, క్రీడలు ముగిసిన అనతరం తిరిగి జాగ్రత్తగా తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీ.ఈ.ఓ అశోక్, భవిత కేంద్రాల కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రావు, ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.