14 March, 2026 | 2:13 AM

ఆశా వర్కర్ల సంక్షేమానికి కృషి చేయాలి

14-03-2026 12:58 AM

మహబూబాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): ప్రజల ఆరోగ్య సేవలో కీలకపాత్ర పోషిస్తూ, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఆశ వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి డిమాండ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కు వినతి పత్రం అందజేశారు. ఆశా వర్కర్లకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని, ఉద్యోగ భద్రత, స్థిర కనీస వేతనం నెలకు 26 వేలు, పిఎఫ్, ఈఎస్‌ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో సిఐటి యు జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి కుంట్ల నాగన్న, పగిడి పాల తిరుపతమ్మ, జల్లే జయరాజు, తిరుగుమల రేణుక, మాలోత్ భద్ర మ్మ, దారం స్వరూప, పోడు పుగంటి అరు ణ, పోలం కవిత, రేగా కవిత పాల్గొన్నారు.