3 April, 2026 | 1:55 PM

Breaking News

మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •   ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు   •   రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి   •   కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •   దక్షిణాసియా వస్త్ర రాజధానిగా తెలంగాణ — సీఎం రేవంత్ రెడ్డి   •  

150 సీట్లు సాధిస్తాం..

02-11-2025 01:06 AM
  1. ప్రజలు తిరస్కరిస్తే ‘పది’కి పరిమితం
  2. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం
  3. జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్

పాట్నా, నవంబర్ 1: ‘అసెంబ్లీ ఎన్నికల్లో మా జన సురాజ్ పార్టీ ఏకంగా 150 సీట్లు సాధిస్తుంది. ఒకవేళ ప్రజలు తిరస్కరిస్తే ఆ సంఖ్య పదికి మాత్రమే పరిమితం’ అని ఆ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండింట్లో ఏదో ఒక్కటి మాత్రమే జరుగుతుందని తాను భావిస్తున్నట్లు కుండబద్దలు కొట్టారు. తమ పార్టీ మరే ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. 160- సీట్లలో తమ పార్టీ గట్టిపోటీ ఇస్తుందని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో ఒకవేళ హంగ్ ఏర్పడి తాము లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వస్తే.. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారవచ్చని పేర్కొన్నారు. వారిని తాను ఆపలేనని, డబ్బు ప్రలోభం, కేసుల భయాలే అందుకు కారణం కావొచ్చని కూడా వ్యాఖ్యానించారు.

బీహార్ రాజధాని పాట్నా నగరం లో శనివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఆర్జేడీ, జేడీయూకు ప్రత్యామ్నాయంగా బీహార్ ప్రజలు ఇప్పుడు తమ పార్టీ వంక చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. మూడింట ఒక వంతు మంది ఈ రెండు కూటములకు ఓటు వేయాలని అనుకోవడం లేదని వెల్లడించారు.