calender_icon.png 19 January, 2026 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం

19-01-2026 05:11:58 PM

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు హనుమకొండ 60వ డివిజన్ వడ్డేపల్లిలో సోమవారం మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, డివిజన్ అధ్యక్షులు ఎనుకొంటి పున్నంచందర్ ల ఆధ్వర్యంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు గూటం రేవతి సురేందర్ రెడ్డి లకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి దశలవారీగా 5 లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో వెయ్యడం వల్లనే  మేము సొంత ఇంటికల నెరవేర్చుకున్నామని అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి లకి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.