calender_icon.png 5 June, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టైఫెండ్ విడుదల చేయాలని వినతి..

03-06-2025 05:15:14 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో బీసీ న్యాయవాదులకు ప్రభుత్వం చెల్లించి స్థాయి ఫండ్ ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ బీసీ న్యాయవాదుల సంఘం మంగళవారం జిల్లా అధికారి శ్రీనివాస్(District Officer Srinivas)కు వినతిపత్రం అందించారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని స్థాపన విడుదల కాకపోవడంతో న్యాయవాదులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 2014 నుండి 2025 వరకు గల నోటిఫికేషన్లను, విడుదల చేయకపోవడం వలన బీసీ న్యాయవాదులకు తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, బీసీ న్యాయవాదుల ట్రైనింగ్ స్టైఫండ్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని నిర్మల్ బీసీ న్యాయవాదులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్రమైన ఆందోళన  కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, డి. రమణ గౌడ్, దేవొళ్ల రాజు, కొమ్మోజీ రమణ, ఎస్ రాజు, న్యాయవాదులు పాల్గొన్నారు.