15 March, 2026 | 8:14 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపుతాం

21-11-2025 12:00 AM

ఇసుక ట్రాక్టర్లకు అడ్డుగా వాగు ప్రదేశంలో కందకాల ఏర్పాటు

విజయక్రాంతి వార్తా కథనానికి స్పందించిన తహసీల్దార్

కల్వకుర్తి, నవంబర్ 20 : ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా ఇసుకను తరలించే ఇసుక మాఫియా పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కల్వకుర్తి తాసిల్దార్ ఇబ్రహీం స్పష్టం చేశారు.  గురువారం విజయక్రాంతి దినపత్రికలో ప్రచురితమైన ’అనుమతుల పేరుతో అక్రమ ఇసుక దందా’ అనే వార్తా కథనాన్ని పరిశీలించారు.  అనుమతుల పేరు చెప్పి అక్రమంగా ఇసుకను తోడేస్తున్న ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తవ్వడం, రవాణా చేయడం పూర్తిగా నిషేధితమని, ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు వాగు వద్ద ట్రాక్టర్లు రాకపోకలు నిలిపివేయడానికి ప్రత్యేకంగా కందకాలు తీయించారు. మునుముందు ఎలాంటి పనులకు ఇక్కడి నుండి అనుమతులు లేవని స్పష్టం చేశారు.