15 June, 2026 | 1:48 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

దూళ్ళగుట్టను అభివృద్ధి చేస్తాం

30-12-2025 01:03 AM

కోదాడ, డిసెంబర్ 29: కోదాడ మండల పరిధిలోని యర్రవరం గ్రామంలో వెలసిన ప్రసిద్ధ దూళ్ళగుట్ట లక్ష్మీనరసింహస్వామి గుట్టను సమగ్రంగా అభివృద్ధి చేసి రాష్ట్ర స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తామని గ్రామ సర్పంచ్ రావుల భవాని వెంకటేశ్వర్లు, ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భాషబోయిన భాస్కర్ రావు అన్నారు. సోమవారం యర్రవరం గ్రామంలోని శ్రీ బాల ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఆవరణలో నిర్వహించిన సన్మాన సభ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

దేవాలయంలో పనిచేసే కార్మికుల జీతభత్యాల సమస్య కూడా పరిష్కరిస్తామన్నారు. భక్తుల రాకతో స్థానిక యువతకు ఉపాధి కల్పనకు అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, భక్తులు అందరూ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.ముందుగా పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సయ్యద్ శాలిని మస్తాన్, ఆలయ గౌరవ సభ్యులు బ్రహ్మయ్య, వార్డు సభ్యులు ఎం శ్రీను, పి శ్రీహరి, భవాని, నరసింహారావు, నెట్టెం నాగేంద్ర, గ్రామ నాయకులు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.