15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఆసిఫాబాద్‌లో పెరుగుతున్న చలి

30-12-2025 01:03 AM

గిన్నెదరిలో అత్యల్పంగా 6.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తం గా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గిన్నెదరి ప్రాంతంలో సోమవారం ఉదయం కనిష్టంగా 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. రాత్రి నుంచి ఉదయం వరకు తీవ్రమైన చలి ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకోవడంతో రహదారులపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు చలి తీవ్రతతో ఇబ్బంది పడుతున్నారు.