calender_icon.png 27 June, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శ మండలంగా రఘునాథ పాలెంను తీర్చిదిద్దుతాం

27-06-2025 01:46:31 AM

మంత్రి తుమ్మల నాగేశ్వర రావు 

రైతులు లాభసాటి ఆయిల్ పామ్ పంట సాగు చేయాలి

ఖమ్మం, జూన్ 26 (విజయ క్రాంతి):  ఆదర్శంగా రఘునాథపాలెం మండలాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.మంత్రి గురువారం నాడు రఘునాధపాలెం మండలం పుఠాని తండాలో ఎ స్టీ.ఎస్.డి.ఎఫ్. నిధులు 20 లక్షలతో, సూర్య తండాలో 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనం వరకు విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్ పోల్స్ వేయాలని అన్నారు. జీపీ భవనానికి కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని, స్టోర్ రూమ్ తొలగించి సమావేశ మందిరం గది విస్తీర్ణం పెంచాలని మంత్రి సూచించారు.జీపీ భవనంలో ఒక రూం ప్రత్యేకంగా రీడింగ్ రూం క్రింద కేటాయించాలని అన్నారు.

రఘునాథపాలెం మండలం ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని, తం డాలలో పూర్తి స్థాయిలో సిసి రోడ్లు నిర్మిస్తున్నామని, పొలాలకు వెళ్లేందుకు కనీసం మట్టి రోడ్లు అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు పుఠానితండా గ్రామంలో 9 మంది, సూర్య తండా గ్రామంలో 10 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇం డ్ల మంజూరు పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డిపిఓ ఆశాలత, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, రఘునాధపాలెం మండల తహసీల్దార్ శ్వేత, ఎంపిడివో అశోక్ కుమార్, ప్రజా ప్రతినిధులు, వివిధ అధికారులు, తదితరులుపాల్గొన్నారు.