calender_icon.png 9 June, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహిష్కరణ వేగవంతం చేస్తాం

09-06-2025 02:17:53 AM

  1. అక్రమ వలసదారుల బహిష్కరణకు చట్టపరమైన ప్రక్రియ అవసరం ఉండకపోవచ్చు

1950 చట్టాన్ని ఉపయోగించుకుంటాం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ

గువహటి, జూన్ 8: అక్రమవలసదారుల గుర్తింపు, బహిష్కరణ ప్రక్రియను మరింత వేగం చేస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) ని అప్‌డేట్ చేస్తున్న కారణంతో అస్సాంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను వెనక్కి పంపే ప్రక్రియ కాస్త నెమ్మదించింది. ఇప్పుడిక ఈ ప్రక్రియను వేగవంతం చేస్తాం.

ట్రిబ్యునల్స్‌కు వెళ్లకుండానే అటువంటి వారిని వెనక్కి పంపే ఏర్పాట్లు చేస్తాం.’ అని పేర్కొన్నారు. ‘ఇప్పటికే అనేక మంది అక్రమ వలసదారుల్ని వెనక్కు పంపాం. ఎవరైతే కోర్టుల్లో కేసులు వేశారో వారిని తప్పా మిగతా వారిని పంపించేశాం.’ అని వెల్లడించారు.