31-12-2025 12:12:19 AM
ములుగు, డిసెంబర్30(విజయక్రాంతి): శ్రీసమ్మక్క సారలమ్మ కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరిగేలా జాతర నిర్వహిస్తామని, జాతర అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని, అధికారుల సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు
మంగళవారం ఎస్.ఎస్. తాడ్వాయి మండ లం కల్వపల్లి నుండి ఊరట్టం వరకు రహదారి పనులను కల్వర్టు నిర్మాణ పనులను, ఊరట్టం కొండాయి రహదారిని పనులను, కల్వర్టు నిర్మాణాన్ని ఆలయ ప్రాంగణం ఫ్లో రింగ్ పనులను,రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రా మీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్., ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐటీడీ ఏ పీవో చిత్ర మిశ్రా లతో కలిసి పరిశీలించారు.అనంతరం మేడారం హరిత హోటల్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని ని ర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీత క్క మేడారం జాతర అభివృద్ధి పనులను శా ఖల వారీగా కూలంకషంగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షిఫ్ట్ ల వారిగా సిబ్బందిని ఉపయోగిస్తూ యుద్ధ ప్రతిపాదికన పడలను పూర్తి చేయాలని, అధికారులు చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా పనిచేసే జాతరను వి జయవంతం చేయాలని సూచించారు.
గత జాతర కంటే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని సౌ కర్యాలు కల్పించాలని అన్నారు.జాతర సమయంలో రెప్పపాటు సమయం కూడా విద్యు త్ సరఫరాలో అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని, తాడ్వా యి, పసర మేడారం చుట్టుపక్కల 10 గ్రా మాల వరకు విద్యుత్ సరఫరాలో అంతరా యం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీటి సరఫరాలో ఇబ్బందులు త లెత్తకుండా చూసుకోవాలని జాతరకు వచ్చే రహదారులకు ఇరువైపులా బోర్ వెల్స్ చేతి పంపులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.జాతర సమయంలో క్యూ లైన్స్ పాత్ర కీలకంగా ఉంటుందని, క్యూలై న్స్, షేడ్స్ నిర్మాణాలలో వేగం పెంచాలని అన్నారు. ములుగు ఘట్టమ్మ వద్ద నూతనం గా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు కూ డా త్వరితగతిని పూర్తి చేయాలని కొత్తూరు నార్లపూర్ రహదారి పనులు, గోవిందరాజు ల పూజారుల కోసం ఊరట్టం వద్ద నిర్మిస్తు న్న వెయిటింగ్ హాల్ నిర్మాణ పనులు యు ద్ధ ప్రతిపాదికన పనులు పూర్తి చేయాలని అన్నారు.
ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులకు జాతర అనంతరం కూడా వచ్చే భక్తులకు నిరంతరం వైద్య సదుపాయాలు అందించాలని, జాతరకు వచ్చే ర హదారుల జంక్షన్ లలో కూడా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ బ స్టాండ్, చిలకలగుట్ట, పార్కింగ్ స్థలాలు, ము లుగు గట్టమ్మ వద్ద ఫీడింగ్ రూమ్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని అన్నారు.