calender_icon.png 10 November, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెలివిజన్ కార్మికులకు అండగా ఉంటాం

10-11-2025 12:00:00 AM

  1. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం
  2. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి) : టెలివిజన్ కార్మికుల సంక్షేమం, అ భివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఆదివారం బేగంపేటలో ని హరిత ప్లాజా హోటల్‌లో తెలంగాణ టెలివిజన్ సమ్మేళనానికి శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంటర్‌టైన్‌మెంట్ రంగం కీలక చోదక శక్తిగా మారిందని, ప్రేక్షకులకు నిరంతరం వినోదాన్ని అందిం చేందుకు టెలి విజన్ కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరూ సమయం, సందర్భం లేకుండా ఎంతో కష్టపడతారని, వారి త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. రాష్ట్రంలో టెలివి జన్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ము ఖ్యంగా కార్మికుల ఆర్థిక, సామాజిక భద్రత సమస్యలపై తమ ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందన్నారు.

ఈ విషయంలో ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని, వారి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి  సానుకూలంగా ఉన్నారని వివరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నాయకత్వంలో త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.