calender_icon.png 1 December, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తా

29-11-2025 12:00:00 AM

పాత్రికేయుడు షఫీకి 50,000 ఆర్థిక సాయం అందించిన మంత్రి అడ్లూరి 

జగిత్యాల అర్బన్, (విజయక్రాంతి): నవంబర్ 28: జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు, ఐ న్యూస్ రిపోర్టర్ మమ్మద్ షఫీ అనారోగ్యానికి గురై హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్స పొందుతుండగా మంత్రి లక్ష్మణ్ కుమార్ షఫీ చికిత్స కోసం రూ. 50,000 ఆర్థిక సాయం అందజేశారు.

శుక్రవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో ఆర్థిక సహాయాన్ని అందించిన మం త్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తాను రాజకీయంగా ఎదగడానికి కారణమైన పా త్రికేయ మిత్రులను ఎప్పుడు మరిచిపోనని అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగిత్యాల పాత్రికేయులు తనకు ఎన్నో విధాల సహకరించారని గుర్తు చేశారు. పాత్రికేయులకు ఎలాంటి సమస్యలున్న తన దృ ష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

పాత్రికేయుడు షఫీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని తాను వ్యక్తిగతంగా ఆసు పత్రికి వెళ్లి యజమాన్యంతో మాట్లాడి త్వర గా శస్త్ర చికిత్స జరిగేలా చూడడం జరిగిందన్నారు.ఆసుపత్రి బిల్లును కూడా సాధ్యమై నంత మేరకు తగ్గించే ప్రయత్నం చే సినట్లు తెలిపారు. షఫీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తాను రు.50 వే లు ఆర్థి క సహాయాన్ని అందిస్తున్నట్లు మం త్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

తాను కిందిస్థా యి నుండి ఎదిగిన వ్యక్తినని, పాత్రికేయు ల సాధక బాధకాలు తనకు తెలుసునన్నారు. పాత్రికేయులకు ఎలాంటి సమస్య వచ్చినా వాటిని పరిష్కరించడంలో ముందుంటానని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల విష యంలో సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్క రించేందుకు కృషి చేస్తానన్నారు.

ప్రజలు ఇ చ్చిన అవకాశంతో మంత్రిగా ఎదిగానని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానన్నారు. జగిత్యాల ఎస్సీ హాస్టల్ వి ద్యార్థి హిమేష్ చంద్ర ప్రమాదవశాత్తు పిడుగుపాటుకు గురి కాగా తాను వ్యక్తిగతంగా చొరవ తీసుకొని విద్యార్థి కుటుంబానికి ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా రూ. 18 లక్షలు ఆసుపత్రి బిల్లు తన మంత్రిత్వ శాఖ ద్వారా చెల్లించినట్లు తెలిపారు. షఫీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ప్రత్యేక శ్రద్ధ చూపి ఆర్థిక సా యం అందించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ కు పాత్రికేయుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ సీనియర్ పాత్రికేయులు పిఎస్ రంగారావు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్య క్ష, కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి, జిల్లా యూనియన్ నాయకులు గడ్డల హరికృష్ణ, హైదర్, సిరిసిల్ల వేణుగోపాల్, నరేష్, రాజిరెడ్డి, పవిత్ర, సీనియర్ పాత్రికేయులు టీవీ సూర్యం, మల్లారె డ్డి, అంజయ్య,తదితరులు పాల్గొన్నారు.