9 April, 2026 | 6:36 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పడిపూజ

28-11-2025 11:18 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలం జంగమాయిపల్లి గ్రామంలో ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రజిత వెంకట్ రెడ్డి నివాసంలో శ్రీశ్రీశ్రీ. ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పడిపూజ కార్యక్రమాన్ని పూజారి శ్రీనివాస్ రావు ఘనంగా జరిపించారు.  ఉదయం 11.30 గంటల నుండి అయ్యప్ప రజిత వెంకట్ రెడ్డి దంపతులు అయ్యప్ప స్వామి పంచంలోహ విగ్రహానికి అభిషేకాలు నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటలకు 18 మెట్ల పడిని వెలిగించి, అయ్యప్పకు హారతులు ఇచ్చారు.

అనంతరం మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు చేసి, స్వామి పాదం తీసుకున్నారు. ఈ సందర్బంగా 18వ మెట్టు రాజేందర్ నాథ్ నారికేలా గురుస్వామిని, ఎల్లారెడ్డి అయ్యప్ప ఆలయ పూజారి శ్రీనివాస్ గురు స్వామిని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రజిత వెంకట్ రెడ్డి దంపతులు శాలువాతో సత్కారించి, ఆశీర్వాదలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ నాథ్, ప్రతినిధులు శ్రీనివాస్, ఈశ్వరగౌడ్, మురళి, తరుణ్ స్వామి, అయ్యప్పలు పాల్గొన్నారు.